గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని రావడం వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కోటీశ్వరులు అయ్యారనడం అవాస్తవమని వైఎస్ఆర్సీపీ నేతలు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం వారు గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. రాజధాని వల్ల మంత్రులు, టీడీపీ నేతలు మాత్రమే కోటీశ్వరులయ్యారని విమర్శించారు.
రైతులు, పేదలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులో భయంతో ప్రధాని నరేంద్ర మోదీ వద్ద సాగిలపడ్డారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకుంటోంది చంద్రబాబేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దుయ్యబట్టారు.