ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష

28 Sep, 2016 12:08 IST|Sakshi
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ బుధవారం నిరాహార దీక్షకు దిగారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో దీక్ష చేపట్టారు. 
 
ఈ దీక్ష కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మరిన్ని వార్తలు