కర్నూలు: టీడీపీ ప్రభుత్వం తమ హక్కులను కాలరాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కర్నూలు జిల్లా కలెక్టర్ విజయ మోహన్ను ఎమ్మెల్యేలు బుధవారం కలిశారు.
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులపై కలెక్టర్తో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చర్చించారు. టీడీపీ ఇంఛార్జులకు నిధులు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సాయి ప్రసాద్రెడ్డి, గుమ్మనూరి జయరాములు, గౌరు చరిత, బాలనాగిరెడ్డి తదితరులు ఉన్నారు.