న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సోమవారం పార్లమెంట్ సమీపంలోని వీపీ హౌస్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.