మహాధర్నాకు భారీ సంఖ్యలో రైతులు

3 Sep, 2016 12:10 IST|Sakshi
కడప : రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించకపోవడానికి నిరసగా శనివారం కడపలో నిర్వహిస్తున్న రైతు మహా ధర్నా లో వైఎస్ఆర్సీపీ అధినేత, విపక్ష నే రేపే మదర్‌కు సెయింట్‌హుడ్ త వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాయలసీమలో ఆయకట్టు భూములకు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లందించక పోవడం, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ వంటి ప్రాజెక్టులపై శీతకన్ను వేయడానికి నిరసగా వైఎస్ జగన్ తొలినుంచి పోరాటం చేస్తున్నారు. ఈ మహా ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిలా రైతులు తరలివచ్చారు. ధర్నాకు రైతు సంఘాలతో పాటు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. రైతులతో పాటు గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. దీంతో కడప పట్టణం జనసంద్రంగా మారింది.
 
మరిన్ని వార్తలు