సీఎం ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం..!

1 Mar, 2019 10:00 IST|Sakshi

సాక్షి, చైన్నై : తమిళనాడు సీఎం పళని స్వామి ప్రయాణిస్తున్న విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. కన్యాకుమారిలో జరుగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే  అత్యవసర ల్యాండింగ్‌ చేసినట్టు తెలిసింది. మరో విమానంలో సీఎం మధురై పయనమయ్యారు. (నేడు నగరానికి ప్రధాని మోదీ)

(చదవండి : తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే)

మరిన్ని వార్తలు