కరోనా: గ్రేటర్‌లో మరో 17 పాజిటివ్‌ కేసులు!

19 Apr, 2020 19:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులకు అడ్డుకట్ట పడటం లేదు. తెలంగాణ వ్యాప్తంగా రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తుండగా.. రాజధాని హైదరాబాద్‌ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లోనే కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తాజాగా.. ఆదివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 18 కేసులు నమోదవగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల 858కి చేరగా.. 186 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 651 గా ఉంది. 

మరో కానిస్టేబుల్‌కు కరోనా.. 
నగరంలోని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న మరో కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో చిక్కడపల్లి పీఎస్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు కోవిడ్‌ బాధితులుగా మారారు. 

మరిన్ని వార్తలు