జల్లికట్టులో యువకుడు మృతి

15 Jan, 2018 18:12 IST|Sakshi

పలమేడు: తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్‌ కలెక్షన్‌ పాయింట్‌ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్‌ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. 

మరిన్ని వార్తలు