బాబ్బాబూ..  బాగా చదవండ్రా!

26 Jan, 2018 01:31 IST|Sakshi

మోకాళ్లపై కూర్చొని విద్యార్థులను ప్రాధేయపడుతున్న ఉపాధ్యాయులు

టీ.నగర్‌: క్రమశిక్షణ, మార్కుల పేరుతో ఉపాధ్యాయులు విద్యార్థులను చితకబాదిన సంఘటనలు చూశాం. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చుని విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. వివరాలు.. తమిళనాడు  విల్లుపురంలో కామరాజర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో చదివిన అనేకమంది ప్రభుత్వ అధికారులుగా, రాజకీయవేత్తలుగా ఎదిగారు. ఇటీవల విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్యపై ఆసక్తి తగ్గుతున్నట్లు ఆ పాఠశాల హెచ్‌ఎం గుర్తించారు.

దీన్ని అధిగమించి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు కొన్ని విధానాలను రూపొందించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చొని ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం 12వ తరగతికి చెందిన ఓ విద్యార్థి ముందు హెచ్‌ఎం మోకాళ్లపై కూర్చొని క్రమశిక్షణతో మెలగాలని, బాగా చదివి ఉత్తీర్ణత సాధించాలని ప్రాధేయపడ్డారు. 

మరిన్ని వార్తలు