త్వరలో చింగారీ యాప్​లో మార్పులు

6 Jul, 2020 11:49 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశీ యాప్​ చింగారీలో త్వరలో భారీ మార్పులు చేయబోతున్నట్లు సహవ్యవస్థాపకుడు సుమిత్​ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్​, బగ్స్​ నుంచి అన్ని రకాలుగా యాప్​ను మార్పుచేయనున్నట్లు ట్విట్టర్​లో ప్రకటించారు. దీని కోసం టీమ్​ రేయింబవళ్లు కష్టపడుతోందని తెలిపారు. టిక్​ టాక్​ బ్యాన్ తర్వాత స్వదేశీ చింగారీ యాప్​ డౌన్​లోడ్స్​ విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ యాప్​ ప్లేస్టోర్​లోకి వచ్చిన 22 రోజుల్లోనే కోటికి పైగా డౌన్లోడ్స్​ జరిగాయి. (అన్నీ ఆపేయండి..)

ఇంత రెస్పాన్స్​ను తాము ఊహించలేదని సుమిత్ చెప్పారు. ప్రస్తుతం చింగారీలో వీడియోలు, ఒక నిమిషం నిడివి కలిగిన న్యూస్ బులిటెన్స్​​ను మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. చింగారీతో పాటు స్వదేశీ సోషల్ మీడియా యాప్స్​ రొపోసో, బోలో ఇండ్యా, మోజ్​ యాప్స్​ డోన్లోడ్స్​ కూడా భారీగా పెరిగాయి. (వాట్సాప్​లో ఐదు కొత్త ఫీచర్స్)

మరిన్ని వార్తలు