భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌ పేమెంట్‌ సేవలు

23 Mar, 2017 01:05 IST|Sakshi
భారత్‌లో శాంసంగ్‌ మొబైల్‌ పేమెంట్‌ సేవలు

ముంబై: శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ తాజాగా భారత్‌లో ‘శాంసంగ్‌ పే’ మొబైల్‌ చెల్లింపుల సర్వీసులను ప్రారంభించింది. ఈ యాప్‌లో నమోదు చేసుకున్న కార్డుల ద్వారా చెల్లింపులు జరపవచ్చు. దీన్ని పేటీఎంతో పాటు యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)కి కూడా అనుసంధానించినట్లు శాంసంగ్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌సీ హాంగ్‌ తెలిపారు. దీని ద్వారా లావాదేవీలు అత్యంత సురక్షితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు