ఔటర్ లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

23 Nov, 2015 08:50 IST|Sakshi

మహేశ్వరం: ఔటర్ రింగు రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాల వద్ద ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో క్లీనర్ అఫ్రోజ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ, డీసీఎంల డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు