నిద్రిస్తున్నవ్యక్తిపై దూసుకెళ్లిన లారీ

27 Aug, 2015 08:58 IST|Sakshi

కరీంనగర్: రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి ప్రమాదవశాత్తూ లారీ వెళ్లటంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన తిమ్మాపూర్ మండలం అలగనూరు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆలగనూరు వైపు వెళ్తున్న లారీ రోడ్డు పక్కన నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తి సిరిసిల్ల మండలం జిల్లెలగడ్డకు చెందిన గూలోత్ బుజ్జు(35)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు.
 

మరిన్ని వార్తలు