కారు, లారీ ఢీ: ఒకరి మృతి

18 Jun, 2015 13:02 IST|Sakshi

డిచ్‌పల్లి : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే కారును ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనగా ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులో ఉన్న వ్యక్తి తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు