వరంగల్: గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరు కాలనీ సమీపంలో శనివారం వేకువజామున చోటు చేసుకుంది.
మల్లూరు పంచాయతీ కొత్తబెస్తగూడెం గ్రామానికి చెందిన గుమ్మల నగేష్(45), బట్ట వెంకటేశ్వర్లు మల్లూరులో శుక్రవారం రాత్రి జరిగిన జాతరకు వెళ్లి తిరిగి వస్తున్నారు.రోడ్డుపై నడిచి వెళ్తున్న వారిద్దరినీ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో నగేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును వరంగల్కు ఆస్పత్రికి తరలించారు.