ఆటో బోల్తా: మహిళ మృతి

7 Apr, 2016 08:59 IST|Sakshi

గరిడేపల్లి: నల్లగొండ జిల్లా లో బుధవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. జిల్లాలోని గరిడేపల్లి మండలంలో కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న బిక్షమమ్మ(45) అనే మహిళ మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 

>
మరిన్ని వార్తలు