ఐరన్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి

13 May, 2016 20:01 IST|Sakshi

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని దేవిశ్రీ ఐరన్ ఫ్యాక్టరీలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో  మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కు తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు