అదుపు తప్పిన బస్సు: 10 మందికి గాయాలు

27 Aug, 2015 22:50 IST|Sakshi

రంగారెడ్డి: ఆర్టీసీ బస్సు ప్రమాదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గురువారం రాత్రి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద బస్సు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. కల్వకుర్తి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. అటుగా వస్తున్న బైకును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది దాకా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు