లారీ ఢీకొని బాలిక మృతి

17 Oct, 2015 18:33 IST|Sakshi

రామాయంపేట (మెదక్) : మెదక్ జిల్లా రామాయంపేట మండలం నందిగామలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కడమంచి అనుష్క(10) పాల కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. పాలు తీసుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా... సిద్ధిపేట వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అనుష్క తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అనుష్కను ఢీకొన్న తర్వాత లారీ అదే వేగంతో అదుపుతప్పి రోడ్డుపక్కనే గల విద్యుత్ స్తంభాలకు కూడా ఢీకొనడంతో అవి విరిగిపోయాయి.

మరిన్ని వార్తలు