108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

28 Mar, 2017 19:57 IST|Sakshi
108,104 ఉద్యోగులకు ఉగాది కానుక

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు ఉగాది సందర్భంగా తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 108, 104 సర్వీస్‌ ఉద్యోగులకు రూ.4వేల చొప్పున జీతాలు పెంచుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు 2016 ఏప్రిల్‌ నుంచి వర్తించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో  1578మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు.

గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు జీతాల పెంపుపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సీ లక్ష్మారెడ్డి పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకు పైలట్లు (డ్రైవర్లు), హెల్త్ టెక్నీషియన్లకు రూ.11,500 వేతనం ఉండేది. ఇపుడు వీరికి అదనంగా రూ.4 వేలు పెంపు వర్తించనుంది.

మరిన్ని వార్తలు