విద్యార్థిని అదృశ్యం

8 Dec, 2015 18:27 IST|Sakshi

బోరబండ (హైదరాబాద్) : బోరబండ పరిధిలోని సాయిబాబానగర్ కాలనీకి చెందిన నిఖితా రెడ్డి(15) అనే విద్యార్థిని అదృశ్యమైంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని పదో తరగతి చదువుతోంది. రోజూ మాదిరే సోమవారం స్కూలుకు వెళ్లిన విద్యార్థిని సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మంగళవారం ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు