వడదెబ్బతో 11 మంది మృతి

28 Mar, 2016 03:04 IST|Sakshi

సాక్షి నెట్‌వర్క్:  తెలంగాణ జిల్లాలో వడదెబ్బతో శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు 11 మంది మృత్యువాతపడ్డారు. వరంగల్ జిల్లా పరకాల మండలం పులిగిల్లకు చెందిన జంపాల రాజయ్య(64) నర్సింహులపేట మండలం పడమటి గూడెం గ్రామానికి చెందిన ఎస్.కె.అజీజ్ (35)లు చనిపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యాతండాకు చెందిన  వడ్త్యీ రాగ్యా (48), ఎన్కూర్ మండల కేంద్రానికి చెందిన తన్నీరు కోటయ్య (65)లు చనిపోయారు.

కరీంనగర్ జిల్లా  ఎల్కతుర్తి మండల కేంద్రానికి చెందిన గుడెల్లి రాజమల్లు(70), ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్‌కు చెందిన ఐదేళ్ల చిన్నారి పరికిపండ్ల బిందుప్రియ, పెద్దపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన కొయ్యడ సాయిలుగౌడ్(65), మాదారపు లక్ష్మి(60) వేడిగాలులకు తట్టుకోలేక మరణించారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం మేకవనంపల్లికి చెందిన టేకులపల్లి పెంటయ్య(70), మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం మాచర్లకి చెందిన భాగ్యమ్మ (50) చనిపోయింది. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని జాలోనిగూడెంకి చెందిన జమ్ము నర్సమ్మ(60) వడదెబ్బతో చనిపోయింది.

మరిన్ని వార్తలు