11క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

15 Sep, 2015 17:57 IST|Sakshi

సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు నుంచి రెండు ట్రాలీలలో అక్రమంగా తరలిస్తున్న 11 క్వింటాళ్ల పీడీఎస్(రేషన్) బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు డీటీసీఎస్ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. రేషన్‌బియ్యాన్ని తరలిస్తున్న చింతల కనకయ్య, తూర్పాటి నరేష్, చింతల సత్యనారాయణలపై 6ఎ కేసు నమోదు చేసి ఆటోలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ గోదాము పాయింట్‌కు తరలించినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు