తెలంగాణలో కొత్తగా 1,178 కరోనా కేసులు

11 Jul, 2020 21:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్:‌ తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,178 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,402కు చేరింది. ఇవాళ ఒక్కరోజే తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే శనివారం రోజున ఆస్పత్రుల నుంచి 1,714 మంది కోలుకోని డిశ్చార్జ్‌ కాగా.. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 20,919కు చేరింది.

కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 348కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,135 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ 11,062 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,884మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో 736, రంగారెడ్డిలో 125, మేడ్చల్‌లో 101 కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు