భద్రాద్రిలో 13 నామినేషన్లు

15 Nov, 2018 15:24 IST|Sakshi

పినపాకలో 3, ఇల్లెందులో 4అశ్వారావుపేటలో 4

కొత్తగూడెం, భద్రాచలంలో ఒక్కొక్కటి  

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో బుధవారం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో గత మూడురోజులుగా వేసిన నామినేషన్ల సంఖ్య 20కి చేరింది. 14వ తేదీన పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రేగా కాంతారావు, బీజేపీ నుంచి చందా సంతోష్, స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ నామినేషన్లు వేశారు. ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోరం కనకయ్య, సిపిఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నుంచి గుమ్మడి నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థులుగా హరిప్రియ, లకావత్‌ దేవీలాల్‌ నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తరపున ఒక నామినేషన్‌ దాఖలైంది. అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి తానం రవీందర్, బీజేపీ నుంచి భూక్య ప్రసాదరావు, అదే పార్టీ నుంచి మరో అభ్యర్థి భూక్య ఉదయజ్యోతి, టీఆర్‌ఎస్‌ నుంచి తాటి వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. భద్రాచలం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గుండు శరత్‌బాబు నామినేషన్‌ దాఖలు చేశారు.    

మరిన్ని వార్తలు