1450 కిలోల క్లోరల్ హైడ్రేట్ స్వాధీనం

15 Oct, 2015 16:16 IST|Sakshi

నారాయణపేట్ (మహబూబ్‌నగర్) : మత్తు కలిగించేందుకు కల్లులో కలిపే రసాయనం క్లోరల్ హైడ్రేట్ పెద్ద మొత్తంలో పట్టుబడింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్ సమీపంలోని సింగారం చౌరస్తాలోని ఓ ఇంట్లో బస్తాల్లో దాచి ఉంచిన 1450 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కూరగాయల శశికాంత్ అనే వ్యక్తికి చెందిన ఆ ఇంట్లో ఓ బడా కాంట్రాక్టర్ దానిని దాచి ఉంచాడని సమాచారం. ఇంటి యజమానిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు