రైతు సమన్వయ సమితికి 15 పోస్టులు 

9 Jun, 2018 01:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర రైతు సమన్వయ సమితిని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 15 పోస్టులను కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయశాఖ అధికారులనే ఈ పోస్టులకు నియమించాలని సూచించింది. మేనేజింగ్‌ డైరెక్టర్, జనరల్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, అకౌంట్‌ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను ఒక్కోటి చొప్పు న కేటాయించగా, రెండు వ్యవసాయాధికారి (ఏవో) పోస్టులను కేటాయించింది. ఇద్దరు డేటా ఆపరేటర్లు, ముగ్గురు ఆఫీసు సబార్డినేటర్లు, చైర్మన్‌కు పీఏ పోస్టులను ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

మరిన్ని వార్తలు