15 టన్నుల నల్లబెల్లం స్వాధీనం

26 Nov, 2015 15:23 IST|Sakshi

గుడుంబా తయారి కోసం ఉపయోగించే నల్లబెల్లం నిల్వలను గురువారం ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వాసవీభవన్ రోడ్డులో ఉన్న లక్ష్మీ రాజ్యం అనే వ్యాపారికి చెందిన గొడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 15 టన్నుల నల్లబెల్లం నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే పది టన్నుల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు.



 

మరిన్ని వార్తలు