భద్రాచలం, న్యూస్లైన్: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఆదివారం భక్త బృందం నిరంతర హరినామ సంకీర్తన చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు చెందిన భక్త బృందం సప్తాహం పేరిట ఈ భజన కార్యక్రమాన్ని చేపట్టింది. 165 గంటలపాటు నిరంతరాయంగా సాగే ఈ కార్యక్రమంలో 130 మంది భక్తులు బృందాలుగా పాల్గొన్నారు. ఈ సంకీర్తన 26వతేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు చెప్పారు.