తెలంగాణలో కొత్తగా 17 కరోనా కేసులు

2 May, 2020 21:52 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 17 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1061కు చేరింది. ఈ ‍మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒకరు మృత్యువాతపడగా ఇప్పటి వరకు మొత్తం 29మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టీవ్ కేసులు 533 కాగా, 499 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు నమోదైన కేసుల్లో 15 జీహెచ్ఎంసీ పరిధిలో.. 2 రంగారెడ్డి జిల్లాలోవి.

మరిన్ని వార్తలు