1,865 పోస్టులకు ఓకే

8 Jul, 2017 03:45 IST|Sakshi
1,865 పోస్టులకు ఓకే

- ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- రెవెన్యూలో 1,506
- పంచాయతీరాజ్‌లో 359


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం అనుమతించిన పోస్టులలో రెవెన్యూ శాఖకు చెందినవి 1,506 పోస్టులు, పంచాయతీ రాజ్‌ శాఖకు చెందిన 359 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అవసరమైన వివరాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇవ్వాలని ఉత్తర్వులో ఆదేశించారు.

మరిన్ని వార్తలు