తెలంగాణలో భారీగా కరోనా కేసులు

8 Jul, 2020 21:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. తాజాగా ఇవాళ 1,924 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 29,536కి చేరింది. ఇందులో 11,933 మంది చికిత్స పొందుతుండగా.. 17,279 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. బుధవారం 11 మంది మృతిచెందగా.. రాష్ట్రంలో మరణాల సంఖ్య 324కి చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 1,590 కేసులు ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

>
మరిన్ని వార్తలు