వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

2 Apr, 2016 11:50 IST|Sakshi

మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో  మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు