రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

26 Jun, 2015 12:38 IST|Sakshi

ఖమ్మం: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన ఖమ్మం పట్టణంలోని మమత ఆస్పత్రి వద్ద శుక్రవారం జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన ఆసిఫ్(35) హుస్సేన్(32) ఇద్దరు యువకులు బైక్‌పై గొల్లగూడలోని మమతా ఆస్పత్రి వైపు వెళ్తున్న సమయంలో ఎదురుగా వరిపొట్టు లోడుతో వస్తున్న లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫ్ ఉదయం మరణించగా.. హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉండటంతో.. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మధ్యాహ్నం మార్గ మధ్యలో మరణించాడు.

మరిన్ని వార్తలు