బావిలో పడి ఇద్దరు రైతుల మృతి

4 Oct, 2015 22:02 IST|Sakshi

లింగంపల్లి: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోటార్ బిగించే యత్నంలో ప్రమాదవశాత్తూ ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబ్పేట మండలం లింగంపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. మోటార్ బిగించడానికి యత్నిస్తూ ఇద్దరు రైతులు ప్రమాదవశాత్తూ వ్యవసాయబావిలో పడి మృతిచెందారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు