చెట్టు కూలి రెండు ఇళ్లు, ఆటో ధ్వంసం

21 May, 2015 12:51 IST|Sakshi

అర్వపల్లి(నల్లగొండ): నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న పెద్ద రావి చెట్టు గురువారం ఉదయం కూలిపోవటంతో రెండు ఇళ్లు, ఒక ఆటో, ఓ కొట్టు ధ్వంసం కాగా ఒకరికి గాయాలయ్యాయి. చెట్టు కొమ్మలు విద్యుత్ లైనుపై పడటంతో రెండు స్తంభాలు విరిగిపోగా వైర్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. అటుగా వెళ్తోన్న మెరుగు వెంకన్నపై చెట్టు కొమ్మలు పడి గాయపడ్డాడు.

మరిన్ని వార్తలు