ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరి మృతి

25 May, 2016 16:41 IST|Sakshi

సత్తుపల్లి: ట్రాక్టర్ పై నుంచి పడి ఇద్దరు కూలీలు మృతిచెందిన సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కూలీలు ట్రాక్టర్‌పై పొలాలకు ఎరువు తరలిస్తున్న సమయంలో చెరువు కట్ట వద్దకు చేరుకోగానే ట్రక్ పై ఉన్న నలుగురు కూలీలు జారి కిందపడ్డారు. అది గమనించని డ్రైవర్ అలాగే ముందుకు పోనివ్వడంతో.. వెంకటేశ్వర్రావు(45), సత్యావతి(40) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు