రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

17 Jun, 2016 09:09 IST|Sakshi

పరకాల: వరంగల్ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పరకాల నుంచి కామారెడ్డిపల్లి వైపు వెళ్తోన్న మోటారు సైకిల్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పరకాలకు చెందిన రఘు, శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు