రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

20 Feb, 2016 12:24 IST|Sakshi
మిర్యాలగూడ : నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగతుర్తి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిహర్ష(2) అనే చిన్నారి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నాగార్జున సాగర్ నుంచి మిర్యాలగూడకు ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమద్యంలో తుంగతుర్తి వద్ద లారీ ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ సంఘటనలో సాయిహర్ష అక్కడికక్కడే మృతి చెందగా తన తల్లిదండ్రులు, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని వార్తలు