వాహన తనిఖీలలో రూ.20 లక్షలు స్వాధీనం

3 Apr, 2015 07:22 IST|Sakshi

మెదక్ (ములుగు): ఆధారాలు లేకుండా కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ఘటనలో సిద్దిపేటకు చెందిన వాసి సత్యం అనే వ్యక్తి నుంచి రూ.20లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదును ఇన్‌కం టాక్స్ అధికారులకు అప్పగిస్తామని ఓఎస్‌డీ జ్యోతి ప్రకాశ్ తెలిపారు.

మరిన్ని వార్తలు