బైక్‌పై రూ. 20 వేలకు పైగా పెండింగ్‌ చలాన్లు

4 Nov, 2019 09:34 IST|Sakshi
ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

బహదూర్‌పురా: బహదూర్‌పురా చౌరస్తాలో ట్రాఫిక్‌ పోలీసులు ఆదివారం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో బైక్‌లు నడుపుతున్న మైనర్లను పట్టుకున్నారు. బహదూర్‌పురా ట్రాఫిక్‌ ఎస్సైలు సత్యనారాయణ, జి.కరుణాకర్‌ రెడ్డి ఆదివారం బహదూర్‌పురా చౌరస్తాలో ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. డ్రైవింగ్‌లో పట్టుబడిన ఓ మైనర్‌ ద్విచక్ర వాహనంపై రూ.20 వేల పైచిలుకు చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకున్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు