3‍ గంటల్లో 25 వేల డాలర్లు

8 Jul, 2018 15:32 IST|Sakshi
శరత్ కొప్పు

కన్సాస్ : గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన శరత్ కొప్పు(26) మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడం కోసం చేపట్టిన క్రౌడ్ ఫండింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. కేవలం మూడు గంటల్లో 25 వేల డాలర్ల విరాళాలు అందాయి.

అమెరికాలో శరత్‌తో పాటు ఉంటున్న అతని కజిన్‌ రఘు ‘గో ఫండ్‌ మీ’ అనే అకౌంట్‌ ద్వారా నిధులను సేకరిస్తున్నారు. హైద్రాబాద్‌ వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తి చేసిన శరత్‌.. ఆ తర్వాత ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ముస్సోరి యూనివర్సిటీలో ఎంఎస్ సీటు రావటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆరు నెలల క్రితం అక్కడికి వెళ్లాడు.

అయితే శరత్‌ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేస్తున్నాడని మాత్రమే తమకు తెలుసని, రెస్టారెంట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలీదని తండ్రి రామ్మోహన్ చెబుతున్నారు. త్వరలో శరత్‌ సోదరి వివాహం ఉంది. ఆ వేడుకకు వచ్చేందుకు శరత్‌ సిద్ధమయ్యాడు. ఇంతలోనే ఆ ఇంట విషాదం నెలకొంది.

మరిన్ని వార్తలు