హత్యకేసులో నిందితుల లొంగుబాటు

2 Apr, 2016 16:32 IST|Sakshi

గొల్లపల్లి: కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం గుంజపడుగు గ్రామంలో గత నెల 31 తేదీన జరిగిన హత్యకేసులో ముగ్గురు నిందితులు శుక్రవారం రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు. గుంజపడుగు గ్రామంలో పత్రి సంతోష్(19) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు హత్య చేసి పరారయ్యారు. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే ఈ విషయం పోలీసులు మృతుడి బంధువులకు తెలపడంతో వారు అన్యాయంగా మా వాడిని పొట్టన పెట్టుకున్నారని నిందితుల ఇళ్లపై దాడి చేశారు. దీంతో పోలీసులు గ్రామంలో పికెట్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు