విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

24 Oct, 2015 16:15 IST|Sakshi

షాద్‌నగర్ (మహబూబ్‌నగర్) : ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పద్మావతి కాలనీలో శనివారం జరిగింది. కాలనీకి చెందిన అక్షయ(3) అనే చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందింది.

మరిన్ని వార్తలు