సాక్షి, చేవెళ్ల : ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుళ్ల ఫలితాల్లో చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన విద్యార్థులు సత్తా చాటారు. గ్రామంలో 30 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో పి.సబితా, పూలపల్లి శివరాజు, వడ్డె భువనేశ్వరి, కె శ్రావణి, దాసరి నరేశ్, ఇతరులు ఉన్నారు.