తెలంగాణలో 38 మంది ఐపీఎస్‌ల బదిలీ

11 Mar, 2018 23:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ఆదివారం భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. 38 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కీలకమైన సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్లకు సమర్థమంతమైన అధికారులను ప్రభుత్వం  నియమించింది.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా అంజనీ కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సజ్జనార్ కుమార్‌లు నియమితులయ్యారు. ప్రస్తుత సెంట్రల్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్‌ను సిద్దిపేట కమిషనర్‌గా బదిలీ అయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా రామా రాజేశ్వరి నియమితులయ్యారు. హైదరాబాద్ సిటీ మాజీ కమిషనర్ శ్రీనివాస్‌ను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.

వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు స్థానంలో ఎ.ఆర్.శ్రీనివాసు నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్‌గా కృష్ణ ప్రసాద్, స్వాతి లక్రా స్థానంలో శిఖా గోయెల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు