ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు

4 Dec, 2015 13:36 IST|Sakshi
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని జైపూర్ మండంలో సోదాలు జరిపిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని నాటు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేపట్టిన అధికారులు 40 కిలోల పటిక, 30 లీటర్ల నాటుసారా, 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. వీటితో పాటు 16 బైక్ లను సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
మరిన్ని వార్తలు