ఆటో, కారు ఢీ: నలుగురికి గాయాలు

7 Aug, 2015 15:25 IST|Sakshi

నల్లగొండ(భువనగిరి అర్బన్): ఆటోను కారు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. భువనగిరి మండలంలోని రాయగిరి శివారులో ఆటోను కారు వెనక వైపు నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు గాయపడ్డారు. వీరంతా ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా ముత్తిరెడ్డి గూడెంకు చెందిన వారని సమాచారం.

మరిన్ని వార్తలు