ఆటోను ఢీకొట్టిన కారు

11 Dec, 2015 09:04 IST|Sakshi

దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా లోని దేవరకద్ర మండలంలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను కారు ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులంతా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. శబరిమల వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

 

మరిన్ని వార్తలు