కడుపులో 40 వస్తువులు

13 Oct, 2014 00:16 IST|Sakshi
కడుపులో 40 వస్తువులు

వరంగల్: వరంగల్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (ఎంజీఎం)లో ఓ రోగికి శస్త్రచికిత్స చేయగా విచిత్రమైన వస్తువులు ప్రత్యక్షమయ్యూరుు. కరీంనగర్ జిల్లా రాగంపేటకు చెందిన సరోజు రమేశ్ మానసిక పరిస్థితి బాగోలేక ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. కడుపునొప్పితో బాధపడుతున్న రమేశ్‌కు డాక్టర్ శ్రీనివాస్, సర్జన్ వైద్యులు శనివారం రాత్రి శస్త్రచికిత్స చేశారు. అతడి కడుపులో నుంచి మేకులు, పెన్సిల్, పెన్నులు వంటి 40 వస్తువులు బయటపడడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు.
 
 

మరిన్ని వార్తలు